మహిళా సాధికారత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ స్థాపనతోనే సాధ్యం!

అనంతపురం అర్బన్: 1వ డివిజన్ మహాత్మా గాంధి కాలనీలో చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి దగ్గుపాటికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి. శనివారం అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కి మద్దతుగా 1వ డివిజన్ మహాత్మా గాంధీ కాలనీలో జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి ప్రచారం నిర్వహించారు. ముందుగా వీరు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదినం సందర్భంగా డివిజన్ నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి ఇంటింటికి తిరిగి దగ్గుపాటి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషిచేసి మీ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించి మహిళా సాధికారత సాధించాలంటే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు తగ్గి మహిళలకు సముచిత స్థానం దక్కాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకుంఠం రమణ, గుడిపూడి శీన, చంద్రమౌళి, ఖాదర్, నాగరాజు, ఎర్రి స్వామి, రంగా, ఇమ్రాన్, లక్ష్మి, మాబున్నీ, ముక్తియార్, శైలజ, గురులక్ష్మీ, గాయత్రి తదితరులు పాల్గొనడం జరిగింది.