ప్రతి కార్యకర్తకి అండగా ఉండటమే జనసేన లక్ష్యం: గాదె

గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ఆదెళ్ళ వాసంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ పంపిణీ చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు క్రియాశీల కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, వారి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిందిగా కోరారు..
వచ్చే ఎలక్షన్లో పొన్నూరు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు మెజారిటీతో జనసేన పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరిని రేపు వచ్చే ఎలక్షన్ లో గట్టిగా పనిచేసి “పొన్నూరు గడ్డ జనసేన అడ్డాగా” చేసి మనము పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో అడపా మాణిక్యాలరావు, మేకల రామయ్య యాదవ్, పొన్నూరు టౌన్ ప్రెసిడెంట్ ఎస్ కే. కరిముల్లా, శిఖా బాలు, యారసాని నాగభూషణం, మల్లిబోయిన గోపి, మిరియాల చంద్రకాంత్, నాగరాజు, మండల అధ్యక్షులు నాగిసెట్టీ సుబ్బారావు, వల్లంసెట్టీ శ్రీధర్, నెల్లూరు రాజేష్, పసుపులులేటి నరసింగరావు, కిషోర్, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.