సినిమాలపై పెట్టిన శ్రద్ద నియోజకవర్గ అభివృద్ధిపై చూపిస్తే బాగుంటుంది: బొర్రా

  • అంబటి రాంబాబును ప్రశ్నించిన సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి నుండి గెలిచిన మంత్రి అంబటి రాంబాబు గారు మీరు దృష్టి పెట్టాల్సింది నియోజకవర్గ అభివృద్ధి మీద, అలానే రాష్ట్ర ఇరిగేషన్ మీద అలాంటిది మీరు మీ శాఖను మరిచిపోయి ఏకంగా సినిమాలపై దృష్టి సారించి మీరేదో పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాకు నిర్మాతగా వ్యవహరించినట్లుగా అన్ని లెక్కలు చెబుతుంటే రాష్ట్రంలో ప్రజలు నవ్వుకుంటున్నారని వెంకట అప్పారావు తెలియచేశారు. బ్రో సినిమాకి ఎక్కడ నుండి నిధులు వచ్చాయని దానిమీద ఎంక్వయిరీ చేయాలని తమరు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చెయ్యాలనీ వెళ్లారు. మరి అక్కడ ఎవరికీ ఫిర్యాదు ఇచ్చారో చెప్పగలరా అని తెలిపారు. అలానే అనవసరంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా వర్కులు చేయకుండా ఎంత నిధులు అక్రమంగా డ్రా చేశారో వాటి పూర్తి వివరాలను త్వరలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కేంద్రమంత్రి గారికి మరియు మా పార్టీ నాయుకులు పవన్ కళ్యాణ్ గారికి అందిస్తామన్నారు. అలానే నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు నిర్మించకుండానే చాలా నిధులు డ్రా చేశారని, వాటిని కూడా జనసేన పార్టీ అధ్యక్షులు దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. మీరు అన్ని ఆధారాలు ఉన్నా బ్రో సినిమాపై పెట్టిన శ్రద్ధను ఈ నిధుల దుర్వినియోగంపై పెడితే అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారని తెలిపారు. అసలు మీరు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఆ శాఖకు ఏం చేశారో చెప్పాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిస్తే రాజుపాలెం మండలం పరిధిలోని బలిజేపల్లి గ్రామం వద్ద ఉన్నటువంటి వాగు నేపథ్యంలో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకుని వచ్చినప్పటికీ కూడా బ్రిడ్జి ఏర్పాటు చేయలేదు.. కానీ బ్రో సినిమాకు మాత్రం ఖచ్చితమైన లెక్కలు మాత్రం చెబుతారు మీరు అంటూ తెలియజేశారు.
ముందు మీరు రాష్ట్రంలో ఉన్న వాగులపై ఉన్న వంతెనలు కట్టడంలోనూ అలానే నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని బ్రో సినిమా లెక్కలపై కాదు అని బొర్రా వెంకట అప్పారావు తెలిపారు.
రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీరు కూడా ఎన్ని నిధులు దుర్వినియోగం చేశారో త్వరలోనే అన్ని బయటపెడతామన్నారు.