మంగళగిరిలో జనసేన నూతన కార్యాలయం

మంగళగిరి, గురువారం ఉదయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం నూతన కార్యాలయ పూజా కార్యక్రమం ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా వేద పండితుల సమక్షంలో జరిగింది. తదనంతరం పండితులు రానున్న రోజుల్లో మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని మరియు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో జనసేన పార్టీ గెలుపొంది చిల్లపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేకమైన ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, ఎంటిఎంసి కోఆర్డినేటర్ మునగపాటి వెంకట మారుతీరావు,రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం సాంబశివరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు షేక్ కైరూల, మంగళగిరి మండల అధ్యక్షులు వాస శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు దాసరి శివ నాగేంద్రం, తుమ్మపూడి నరసింహారావు, శెట్టి రామకృష్ణ మరియు చిల్లపల్లి యూత్ సభ్యులు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.