ఎలుగు దాడి బాధితులని పరామర్శించిన జనసేన నాయకులు

శ్రీకాకుళం జిల్లా, ఇటీవల ఈనెల 19వ తేదీన వజ్రపుకొత్తూరు మండలం, కిడిసింగిలో ఎలుగుబంటి దాడి చేయగా ఒక వృద్ధుడు మరణించడం జరిగింది. తరువాత 20వ తేదీన వజ్రపుకొత్తూరు గ్రామంలో తోటలలో పశువులశాల నిర్మించడం కొరకు వెళుతుంటే యువకులపై ఎలుగుబంటి గుర్తు పట్టలేనంతగా ముఖాలపై తీవ్ర దాడి చేసింది. ఎలుగును ఆపడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసి బీభత్సం స్పృష్టించింది. క్షతగాత్రులను పలాస హాస్పిటల్ కు తరలించి, మెరుగైన వైద్యానికి శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు, ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్, పలాస నియోజకవర్గ జనసేన నాయకులు సంతోష్ పండా, కోన కృష్ణారావు, కిల్లి బాలకృష్ణ, కేదార్ నాథ్ లు మురళి, రాజశేఖర్ భాస్కర్, కోటి మరియు తదితరులు బాదితులని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. ఈ విషయం పై జనసేన పార్టీ, 19న ఎలుగు దాడిలో మృతి చెందగానే, స్థానిక మంత్రి, రెవెన్యూ మరియు ఫారెస్ట్, విపత్తుల శాఖ సకాలంలో స్పందించుంటే.. రెండోరోజు ఎలుగు దాడి చేసేది కాదు. చనిపోయిన వ్యక్తికి 5లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించింది. మృతుని కుటుంబానికి 20 లక్షలు, దాడికి గురయ్యే వారికి ఉచిత వైద్యంతో పాటు, వారు కోలుకుని పనిచేసుకునేవారకు వారికి ఆర్ధికంగా ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. దాడికి గురయిన పోతనపల్లి, తారకేశ్వరరావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా వైద్య ఖర్చులు మేమే భరిస్తున్నాం అని వాపోయారు. ఒకరోజు ముందు రెవెన్యూ, ఫారెస్ట్, రెస్క్యూ టీంలు స్పందించుంటే మాకీ అవస్థ తప్పేదని బాధపడ్డారు.