పార్వతీపురం జనసేన ఆధ్వర్యంలో జనసేనాని పుట్టినరోజు వారోత్సవాలు

*పలు సేవా కార్యక్రమాలు ప్రకటించిన జనసేన పార్టీ జిల్లా నాయకులు

పార్వతీపురం, జనసేన పార్టీ వ్యవస్థాపకులు, జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2, సందర్భంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, రెడ్డి కరుణ, గొర్లి చంటి, వంగల దాలి నాయుడు, బంటు శిరీస్, రాజాన రాంబాబు, శిరిపురపు గౌరీ శంకర్, మానేపల్లి ప్రవీణ్, తమ్ముడు సాయి, గంగిరెడ్ల జగదీశ్, వంగలపూడి నాని తదితరులు మాట్లాడుతూ తమ జనసేనని పుట్టినరోజు సందర్భంగా వారం రోజులు వేడుకలు నిర్వహించనున్నామన్నారు. దీనిలో భాగంగా ఆగస్టు 28 ఆదివారం రక్తదాన శిబిరాన్ని స్థానిక ఆర్కే జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 29వ తేదీన సోమవారం పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం, ఆగస్టు 30వ తేదీన మంగళవారం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. ఆగస్టు 31వ తేదీన బుధవారం పార్టీ ఆఫీసులో వినాయక చవితి కార్యక్రమం, సెప్టెంబర్ ఒకటవ తేదీన పార్వతీపురం మెయిన్ రోడ్డు లో ఉన్న ప్రతి షాప్ కు మొక్కలు పంచే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సెప్టెంబర్ రెండవ తేదీన దేవాలయంలో పూజా కార్యక్రమంతో పాటు బైక్ ర్యాలీ, అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. వారం రోజులు చేపట్టే సేవా కార్యక్రమంలో ప్రతి జనసైనికుడు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.