మహిళకు 50,000 సహాయంతో టిఫిన్ బండి ఏర్పాటు చేసిన జనసేన

తెలికిచర్ల జనసైనికుల ఆర్ధిక సహాయంతో తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బీసీ మహిళ కుటుంబానికి సుమారు 50,000 రూపాయల ఖర్చుతో టిఫిన్ బండి మరియు సామగ్రి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటివంటి నల్లజర్ల మండల నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, కార్యదర్శి అచ్చుత సత్యనారాయణ, కార్యదర్శి మద్దాల మణి కుమార్ తాడేపల్లిగూడెం జనసేన వీరమహిళా విభాగం చైర్మన్ కాసిరెడ్డి మధులత, ఇజ్జురోతు నాగసత్యనారాయణ(సత్తిబాబు), చోడసాని బాపిణీడు, వీరమహిళ తలారి సౌజన్య, ఉనమట్ల రమేష్, మేకా శ్రీనివాస్, గోపిశెట్టి బోడియ్య, కంకిపాటి సువర్ణ రాజు, పదిలం దుర్గారావు పాల్గొన్నారు.