మత్స్యకార పోరాట మహా శాంతియుత ధర్నాకి జనసేన మద్దతు

  • జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచన మేరకు 365 రోజులకు చేరుకున్న హెటిరో కంపెనీ బాధిత గ్రామాల మత్స్యకార పోరాట మహా శాంతియుత ధర్నాకి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు

పాయకరావుపేట: హెటిరో కంపెనీ బాధిత గ్రామాల మత్స్యకార పోరాట మహా శాంతియుత ధర్నా చేపట్టిన మొదటి రోజు నుండి ఇప్పటివరకు జనసేన పార్టీ ఈ మహా శాంతియుత ధర్నాకి సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మరియు రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి ఆధ్వర్యంలో అండగా నిలబడింది. ఈ సందర్భంగా స్టేట్ సెక్రెటరీ శివదత్ మాట్లాడుతూ
400వ రోజు పూర్తయ్యే లోపు హెటిరో కంపెనీ యాజమాన్యం పైప్ లైన్లు పూర్తిగా తొలగించి, భవిష్యత్తులో మరొకసారి ఇటువంటి లైన్ వెయ్యమని భరోసా కల్పించని యడల మత్స్యకారుల పోరాటానికి మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నక్కపల్లి నుంచి అనకాపల్లి వరకు భారీ పాదయాత్రతో జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నేతలు పీఏసీ సభ్యులు కోన తాతారావు మాట్లాడుతూ.. మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు మీకు కనపడటం లేదా, జగన్ రెడ్డి మానస పుత్రిక గా వున్న మీకు ఇంత చిన్న చూపు తగదు, తక్షణమే స్పందించక పోతే స్థానిక నాయకులతో కలిసి భారీ ఉద్యమం చేపడతాం అని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి అంగ ప్రశాంతి మాట్లాడుతూ చట్టపరంగా న్యాయశాఖ నుంచి కూడా ఒత్తిడి తీసుకువస్తాం అన్నారు. భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్ మాట్లాడుతూ.. మత్స్యకారులు కట్టిన నిరసన గోడే వైఎస్సార్సీపీ పార్టీ పతనానికి పునాది అని హెచ్చరించారు. విశాఖ నార్త్ ఇంచార్జ్ ఉషా కిరణ్ మాట్లాడుతూ మత్స్యకారుల పోరాటం కోసం ఎంత దూరమైనా ఎన్ని సార్లు అయినా వస్తాం నిలబడతాం అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల లక్ష్మి, ముమ్మిని నాగమణి, కృష్ణయ్య, శ్రీను బాబు, మైలపల్లి నూకరాజు, కురందాసు అప్పలరాజు, పిక్కి స్వామి, బొంది గుర్రన్న, బాబుజి, రాజు బంగారి, అల్లాడ రమణ, పినపోలు సతీష్, గబ్బర్ సింగ్, గిరీష్, ఆనంద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.