రైతు భరోసాయాత్రను జయప్రదం చేయండి: ఆచంట జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర రెండో విడతలో భాగంగా 23/4/2022 శనివారం ఉదయం 9 గంటలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బైపాస్ నుండి నేరుగా.. చింతలపూడి చేరుకుని, అక్కడ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని.. రచ్చబండ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు, వారి పిల్లల భవిష్యత్తు కు భరోసా కల్పించడం కోసం ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. కావున ఈ కార్యమానికి ఆచంట నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం స్థాయి నాయుకులు, మండల కమిటీ అధ్యక్షులు, సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ఆచంట నియోజకవర్గం జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ షేక్ మహ్మద్ ముంతాజ్ బేగం ఆలీ, జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ కోరారు.