అనంతపురం అర్బన్ లో మహిళలతో జనసేన మాటామంతీ

  • వైకాపా ప్రభుత్వ హయాంలో పక్కా గృహాలకు నోచుకోని 2వడివిజన్ బిందెలకాలనీ ప్రజలు
  • ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 503 కోట్లతో ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మానాలు చేపట్టామని అన్నావు ఎక్కడ ఎవరికి ఇచ్చారో చెప్పగలరా?
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్: ఆదివారం అనంతపురం అర్బన్ నియోజక వర్గంలోని స్థానిక 2వ డివిజన్ బిందెల కాలనీ నందు జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మహిళలతో-మాటమంతి కార్యక్రమాన్ని రెండవరోజు నిర్వహించి స్థానిక సమస్యలను తెలుసుకొని జనసేన టిడిపి కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండవ డివిజన్ బిందెల కాలనీ నందు ఎంతో మంది నిరుపేద ప్రజల జీవిస్తున్నారని, వారికి కనీస సదుపాయాలలో ఒకటైన గృహ నిర్మాణం వైకాపా ప్రభుత్వం మరచిందని, పక్కా గృహాల నిర్మాణంలో వైసీపీ పేద ప్రజలకు తీరని అన్యాయం చేసిందని, దీనితో పాటు ఈ కాలనీలో ప్రాథమిక పాఠశాల లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, జనసేన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ డివిజన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. వీటితోపాటు మహిళల కోసం జనసేన టిడిపి ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.