త్వరలోనే జనస్వరం న్యూస్ అభివృద్ధి చెంది వారు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలి: టి.సి వరుణ్

అనంతపురం, జనసేన పార్టీకి అనుబంధంగా న్యూస్ అందిస్తున్న జనస్వరం న్యూస్ వ్యవస్థాపకులు సాకే నరేష్ జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ ను ఆయన స్వగృహంలో కలిశారు. సాకే నరేష్ తాము చేస్తున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. అలాగే త్వరలోనే జనస్వరం మ్యాగజైన్ ను ప్రతి నెలా ప్రింటింగ్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు మాట్లాడుతూ ఒక సామాన్య జనసైనికుడు సాకే నరేష్ ఒక మీడియా వ్యవస్థను ప్రారంభించి. జనసేన పార్టీ కోసం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. గతంలోనే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జనస్వరం గురించి తెలుసుకొని నరేష్ ను అభినందించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నరేష్ అనంతపురం జిల్లా వాసి కావడం మాకు గర్వకారణం. త్వరలోనే జనస్వరం న్యూస్ అభివృద్ధి చెందాలని, వారు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని కోరుతూ ఈ విషయాన్ని అద్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం జనస్వరం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, అనంతపురం రూరల్ కన్వీనర్ రామాంజనేయులు, జనసేన నాయకులు రవి, మురళి, మహేంద్ర, మనోజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.