నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: పెనుగంచిప్రోలు మండల జనసేన

పెనుగంచిప్రోలు మండల తహసీల్దార్ కి శుక్రవారం వినతిపత్రం అందజేయడం జరిగింది మండలంలోని రైతుల ప్రధాన సమస్యలు అకాల వర్షాల మరియు చీడ పురుగుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మరియు ఎరువులు విత్తనాలు ధరలను నాణ్యతను ప్రభుత్వ బాధ్యత వహించి నియంత్రించాలని రైతుల నుంచి దాన్యం కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన దాన్యంకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో వేయ్యాలని జనసేన తరపున తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల జనసేన అధ్యక్షుడు తునికిపాటి శివ, వైఎన్ఆర్ మాస్టర్ చారి గోపీచంద్, గోపయ్య, నవీన్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.