జనవాణి – జన చైతన్య యాత్ర

చీపురుపల్లి, జనవాణి – జన చైతన్య యాత్ర అనే పేరుతో ప్రజల్లోకి వెళదాం అని చీపురుపల్లి జనసైనికులు శుక్రవారం సమావేశమై చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. తదుపరి నియోకవర్గస్థాయిలో ఉన్న జనసైనికులు, నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కలసి 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రౌతు కృష్ణవేణి, పెద్ది వెంకటేష్, ఎడ్ల సంతోష్, బోడసింగి రామకృష్ణ, అప్పలనాయుడు, దన్నాన యేసు, గోళ్లబాబు, సత్య, కిషోర్, చందక బాల, జగదీశ్, బంటుపల్లి శంకర్, బాకూరి శ్రీను, ధనుంజయ, లెంక జగదీశ్, వినోద్ కుమార్, సువర్ణరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.