తిరుపతిలో ప్రారంభమైన జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం

•ఐదు జిల్లాల ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్
•మొదటి గంటలో 220కి పైగా సమస్యలు నమోదు
•మొదటి అర్జీగా కడప జిల్లా బ్రహ్మం సాగర్ నిర్వాసితుల గోడు
•కబ్జా కోరల నుంచి దర్గా భూములు కాపాడాలంటూ ముస్లిం సోదరుల విన్నపం

తిరుపతి వేదికగా నాలుగో విడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జీఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో సమస్యలపై వినతులు స్వీకరిస్తున్నారు. మొదటి రెండు సమస్యలు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లా నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చెంతకు వచ్చాయి. బ్రహ్మం సాగర్ నిర్వాసితులతో పాటు తమ దర్గాను కబ్జా కోరల నుంచి కాపాడాలంటూ మైనారిటీ సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు సమర్పించారు. దర్గా భూముల్ని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు యత్నిస్తున్నారని, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తమపై కేసులు పెడుతున్నారని ముస్లిం సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట వాపోయారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చెంతకు వెళ్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ముస్లిం మత పెద్దల తీర్మానం మేరకు సమస్యను జనవాణి కార్యక్రమానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా సమస్యలు చెప్పుకునేందుకు ఉదయం నుంచి ప్రజలు క్యూ కట్టారు. మొదటి గంటలోనే 220 మందికి పైగా బాధితులు సమస్యలు చెప్పుకునేందుకు నమోదు చేసుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. కార్యక్రమాన్ని పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ వరప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *