పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించండి: షేక్ మహబూబ్ మస్తాన్

అనంత సాగరం మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం చాలా దారుణంగా ఉంది.. అదేవిధంగా పారిశుద్ధ్యంతో పాటు రోడ్లు సరిగా లేక సైడ్ కాలువ పూడిక తీయక పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాలకు అనుసంధానమైన రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. పాత దేవరపల్లి పంచాయతీలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్ మస్తాన్ పర్యటించి.. అక్కడి పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి.. ఆ గ్రామాలకు సంబంధించిన పంచాయతీ సిబ్బంది లేదా.. మండల అధికారులు వెంటనే పారిశుద్ద్యం రోడ్లు, కాలువల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ.. పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది.