జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన పోలిశెట్టి

మైలవరం నియోజకవర్గం: ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామ జనసేన కార్యకర్త
కీ.శే గంధం శ్రీనివాస రావు కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ శ్రీనివాసరావు చిత్రపటానికి ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ నివాళులర్పించారు. మృతిచెందిన శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని ఎలాంటి సమస్య వచ్చినా మా స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పోలిశెట్టి తేజ హామీ ఇచ్చారు. అనంతరం కాచవరం మరియు దొనబండ పంచాయతీ ప్రాంతాల్లోని జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని కార్యకర్తలను పోలిశెట్టి తేజ కోరారు.