శ్రీరాములు పేటలో పర్యటించిన జెసి

తాడిపత్రి, బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాడిపత్రి పట్టణంలోని శ్రీరాములు పేట నందు తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. జెసి అష్మిత్ రెడ్డి వెంట తాడిపత్రి జనసేన సమన్వయకర్త కదిరి శ్రీకాంత్ రెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రంగనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి పట్టణ టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.