రమణమ్మకి రూ.70000 ఆర్థిక సాయం చేసిన జానీ మాస్టర్

నెల్లూరు, అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు మద్దతుగా ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సంఘీభావం తెలియజేసారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ రాంగోపాల్ వర్మకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో జగన్ అంటే నాకు అంత ఇష్టం. అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతాను అన్న జగన్ మాట తప్పడం నాకేమీ నచ్చలేదు. ప్రసవం తర్వాత నా భార్య ఇద్దరు బిడ్డలతో ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు, అటువంటిది ఎంతోమంది బిడ్డలని ఓర్పుతో ఆదరిస్తున్న అంగన్వాడి తల్లులని న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇండ్ల వనమ్మ అంగన్వాడీ కార్యకర్తల పోరాటంలో అసువులు బాసిన రమణమ్మకి రూ.70000 జానీ మాస్టర్ ఆర్థిక సాయం చేయడం జరిగింది. గునుకుల కిషోర్ మాట్లాడుతూ నా తల్లికి ముగ్గురే బిడ్డలు, నా భార్యకి ఇద్దరు బిడ్డలు కానీ అంగన్వాడి తల్లులకు ఎంతమంది బిడ్డలు అంటే లెక్క చెప్పలేం. మా అంగన్వాడి తల్లులపై నీ దౌర్జన్యం ఏంటి జగన్. అంగన్వాడీ కార్యకర్తల కేంద్రాలను సచివాలయం సిబ్బందిని తీయిస్తున్న జగన్ చెత్త మున్సిపల్ కార్మికుల సమ్మె చేస్తున్నారుగా కాలువలు కూడా తీయిస్తారా. ఒళ్ళు బలిసింది అక్రమంగా దోచుకుంటున్న మీకు వైసీపీ మంత్రి ఒళ్లు వంచి కష్టపడుతున్న మా తలాలు కాదు. అంగన్ వాడి తల్లుల న్యాయమైన కోరికలు తీర్చే వరకు మద్దతుగా నిలుస్తాం. చాలా తక్కువ జీతంతో బతుకు ఈడుస్తున్న అంగన్వాడి కార్యకర్తల ఆర్థిక సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీతాలు పెంచాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలిపి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపి వారి న్యాయమైన పోరాటానికి ఎంత దూరమైనా జనసేన పార్టీ కూడా సిద్ధమని తెలిపారు.