టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిక

  • పవన్ కళ్యాణ్ ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత
  • పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్దాం
  • జనసేన పార్టీని బలోవితం చేసి రానున్న 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేద్దాం
  • అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం యువకుల చేరిక
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్

అనంతపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన యువత జనసేన పార్టీలోకి చేరడం శుభపరిణామం అని జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన పాతికమంది యువకులు జనసేన పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వారికి అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టీ.సి.వరుణ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. త్వరలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గం మండల కమిటీలు, పట్టణ కమిటీలు వేసి యువతకు సంబంధిత స్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని స్థానికంగా ఉన్న సమస్యల గురించి టి.సి.వరుణ్ సుదీర్ఘంగా వారితో చర్చించారు. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉద్యమించాలని. మీకు అన్ని విధాలుగా జిల్లా కార్యవర్గం అండగా నిలుస్తుందని అన్నారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమన్వయంతో పని చేద్దామని వారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి, సెట్టూరు మండలం అధ్యక్షులు కాంతరాజు, బ్రహ్మసముద్రం మండలం అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు చెర్లోపల్లి రామలింగ, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ, గురుస్వామి, కార్యదర్శి సతీష్ కుమార్, మరియు నాయకులు వంశీ, వీరమహిళ శ్రీమతి షేక్ తార, జాకీర్, హర్ష, రాంప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది.