జనసేన పార్టీలో చేరికలు

చిత్తూరు: పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన మాజీ టీడీపీ నాయకులు అంగజాల రాజన్న, నరసింహులు, పసుపులేటి సుబ్రామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ వారందరినీ పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగుతోందని దీన్ని ఎదుర్కొనేందుకు జనసైనికులు సిద్ధం కావాలన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందలకొద్దీ పార్టీలో చేరడం శుభపరిణామం అని, ఈ చేరికలు చూస్తున్నట్లయితే రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.