కూనవరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, కూనవరం జనసేన నాయకులు మాధవరపు వీరభద్రరావు గారి పిలుపు మేరకు కూనవరం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ అన్నసమారాధన కార్యక్రమానికి వెంకటలక్ష్మి 5,000/- రూపాయల విరాళాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాధవరపు కోటేశ్వరరావు, అడపా నరసింహారావు, మాధవరపు నాని, చౌటుప్పల్లి లాలిబాబు, బండారు గుణశేఖర్, ఉమ్మడి శెట్టి సురేష్, దూలం వీర వెంకట సత్యనారాయణ, దూలం సురేష్ , చలంశెట్టి మణికంఠ తదితరులతో పాటు కూనవరం గ్రామ ప్రజలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.