జనసేన పార్టీలో చేరికలు

రంపచోడవరం నియోజవర్గం: రంపచోడవరం మండలం, రంప గ్రామంలో బుధవారం ఉదయం 6 గంటలకు 50 కుటుంబాలు కుర్ల రాజశేఖర్ రెడ్డి, పాపొలు శీను సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఒక్క రూపాయి కూడా అవినీతి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ తో ప్రయాణం చేస్తే మెరుగైన సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని రాజశేఖర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంపచోడవరం నియోజవర్గం నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, రంపచోడవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పాపొలు శీను, కొనతం శ్రీనివాస్, మరియు తదితరులు పాల్గొన్నారు.