జనసేన పార్టీలో చేరికలు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలోని, ముత్తుకూరు పంచాయతీ నుంచి పల్లపు శ్రీను సమక్షంలో జనసేన పార్టీ ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో మంగళవారం కొంతమంది జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మనుబోలు గణపతి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో పొత్తులో భాగంగా జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని, అధికార భాగస్వామ్యం అవ్వాలని తెలియజేసి పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల ఉపాధ్యక్షుడు పోలూరు పెంచల నరసింహా, వీరబాబు, మండల ప్రధాన కార్యదర్శిలు చినకంగారి కసుమూరు, తాండ్ర శ్రీనివాసులు పాల్గొన్నారు.