వజ్రపుకొత్తూరులో జనసేన పార్టీలో చేరికలు
- పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వజ్రపుకొత్తూరు మండలంలో పలువురు జనసేన పార్టీలో చేరారు!!
పలాస: వజ్రపుకొత్తూరు మండలం, పల్లి ఊరు పంచాయతీలో సోమవారం డాక్టర్ దుర్గారావు ఆధ్వర్యంలో పలువురు జనసేనలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కేత నీలవేణి, పుష్పవతి, వరలక్ష్మి, గోరకల సోమేశ్వరరావు తదితరులుకు డాక్టర్ దుర్గారావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాల నచ్చి చేరామని వారు అన్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ కూటమిని గెలిపించి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. తిత్లి సమయంలో మా ప్రాంతానికి వచ్చి మా బాధలు విని మాకు అన్ని విధాలుగా ఆదుకున్నారని ఆయనకు వారు గుర్తు చేసుకున్నారు. ఈసారి పలాస నియోజకవర్గంలో జెండా ఎగరవేయడం ఖాయమని వాళ్ళు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్ లావేటి, నందిగాం ధర్మారావు, యండమూడి రాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి మనసున్న నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాలాంటి పేద ప్రజల బతుకులు మారతాయని వారు చెప్పారు.