ఇప్పటంలో పర్యటించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది కె.చిదంబరం

మంగళగిరి, హైకోర్టు సీనియర్ న్యాయవాది కె.చిదంబరం ఇప్పటం గ్రామాన్ని సందర్శించడమైనది. ఇప్పటం గ్రామ ప్రజలను కలిసి వారికి జరిగిన అన్యాయం గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. వీరికి అధికార పార్టీ వారు చేసిన అన్యాయాన్ని, నష్టాన్ని వారిచేతే కట్టించ్చే విధంగా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువస్తానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.