యువశక్తి వేదిక సాక్షిగా జనసేనలో చేరికలు

జనసేన యువశక్తి వేదిక సాక్షిగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. రణస్థలం మండల జనసేన పార్టీ నాయకుడు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎంపీటీసీలు మూగి శేఖర్, ఎం. పోతురాజు, టీడీపీ ఎంపీటీసీ సీహెచ్ శ్రీను, వైసీపీ మండల నాయకులు మూర్తి, సీహెచ్ రాజు, ఎం.ఎల్లయ్య, ఎర్రయ్య, అమ్మోరు, కె.ఎర్రయ్య, ఠాగూర్, సూరడ ఎర్రయ్య, ప్రసాద్, సత్యతోపాటు సుమారు 50 మంది వరకు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి మనోహర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాల కోసం, జనసేన పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా పని చేయాలని మనోహర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బొమ్మిడి నాయకర్, విశ్వక్షేన్, గేదెల చైతన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం రణస్థలం యువశక్తి ప్రాంగణంలో ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నేతలు సుందరపు విజయ్ కుమార్, శ్రీమతి పాలవలస యశస్వి, గర్భాన సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.