పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ మండలం, పండూరు గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. తదుపరి ఎంపీటీసీ-1 నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు, నందిపాటి రమణ ఆధ్వర్యంలో పండూరు వైసీపీ నాయకులు భావిశెట్టి వెంకటేశ్వరరావు నాయకత్వంలో సుమారు 100 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి జనసేన-టీడీపీ పార్టీల కాకినాడ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి, జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు. అనంతరం జనసేన మరియు తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గరగా శ్రీనివాస్, మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ మరియు స్థానిక టీడీపీ నాయకులు భావిశెట్టి శ్రీనివాస్, కొల్లాబత్తుల వీరబాబు, గుమ్మేళ్ల శ్రీనివాస్, కొప్పిశెట్టి రమణ, భావిశెట్టి ప్రసాద్, నందిపాటి సత్తిబాబు, కర్రి నాగేశ్వరావు, గుమ్మేళ్ల వీరబాబు మరియు జనసేన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.