మాకినీడి శేషుకుమారి సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు

పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో.. పిఠాపురం టౌన్ నుండి తెలుగుదేశం పార్టీ నుండి మాజీ కౌన్సిలర్ పిఠాపురం 2వ వార్డ్ కర్రీ కాశీ వెంకట లక్ష్మి, 10వ వార్డ్ కార్యకర్త నెయ్య కాపుల సురేష్, మసీగడ్ల అప్పారెడ్డి, వారి అనుచరులు మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు వేణు నారాయణ రావు, పుణ్య మంతుల మూర్తి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి ఆదివారం పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో వారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారిని పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించి.. ఈ సందర్భంగా మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ.. జనసేన పార్టీ పై నమ్మకంతో జాయిన్ అయిన సోదరులకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని శేషుకుమారి హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పిఠాపురం పట్నంలో అన్ని వార్డుల్లో జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలి అని దీనికి ప్రతి జన సైనికుడు నాయకులు సహకరించాలని మనం అందరం కలిసికట్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి ప్రజలకు అండగా జనసేన పార్టీ ఉంటుందన్నారు. అలాగే జనసేన నాయకులు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అండగా ఉంటూ ముందు 5 కోట్లు విరాళం అందించి ఇప్పుడు 30 కోట్లు ఈ చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు పెద్ద కొడుకులా అండగా భరోసా ఇస్తూ.. అలాగే మన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి గారు 5 లక్షలు రూపాయలు పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రకటించటం మాకు గర్వంగా ఉందంటూ.. అందర్నీ కలుపుకుంటూ పిఠాపురంలో జనసేన జెండా ఎగిరేలా కలిసి పని చేస్తామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో.. పిఠాపురం టౌన్ జనసేన నాయకులు పుణ్యమంతుల మూర్తి, పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ కర్ణం చిన్నారావు, కడారి తమ్మయ్య నాయుడు, పిఠాపురం మాజీ కౌన్సిలర్ వేణుం నారాయణరావు, గొల్లప్రోలు మండలం పెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శిలు మొగలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఏనుగంటి హరిబాబు ఎంపిటిసి అభ్యర్థిలు రాసాంశెట్టి కన్యకరావు, కేతినీడి గౌరినాగలక్ష్మి, వెనుకొండ తోట శ్రీకాంత్ అమ్మాజి, జనసేన నాయకులు గోపు సురేష్, వంకా కొండబాబు, మేళం బాబి, యండ్రపు శ్రీనివాస్, కంద సోమరాజు, సి.హెచ్ శిరీష, తోట సతీష్, బాలేపల్లి అనిల్, కోన రామకృష్ణ, దేశి రెడ్డి సతీష్, నిమ్మ దుర్గ, బస్వా గోపి, కళ్ళు రాజు, పెనుగొండ వెంకటేశ్వరరావు, పెనుగొండ సోమేశ్వర రావు, మాదేపల్లి పద్మరాజు, ఇజ్రాయిల్, కామేష్, సత్యానదా రెడ్డి, కసిరెడ్డి నాగేశ్వరరావు, జీలకర్ర గోవింద్, వెలుగుల లక్ష్మణ్, గొల్లపల్లి గంగ, పెద్దిరెడ్ల భీమరాజు, చుక్క శ్రీను, మచ్చ అప్పారావు, జి.వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.