ఇస్రో శాస్త్రవేత్తలకు గుడివాడ జనసైనికుల అభినందనలు

గుడివాడ నియోజకవర్గం: కృష్ణాజిల్లా, గుడివాడ పట్నంలో జనసైనికులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేసారు. చంద్రయన్ 3 సాధించిన ఈ విజయంతో అంతరిక్ష రంగాన భారత అగ్రరాజ్యాల సరసన నిలిచిందని చెప్పడం ఎంత మాత్రాన అతిశయోక్తి కాదు. ఈ విజయం మరిన్ని ప్రయోగాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ చంద్రాయన్ 3 మిషన్ సంపూర్ణంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మన దేశ ప్రజలు గర్వించదగ్గ విషయమని ఆ రోజుల్లో సైకిల్ తో, ఎద్దుల బండ్లపై రాకెట్ పరికరాలు తీసుకువెళ్లినప్పుడు వివిధ దేశాలు మన దేశాన్ని హేళన చేస్తూ చిన్నచూపు చూసేయ్ అదే ఈరోజు చంద్రునిపై దక్షిణ ధ్రువం పైకి చంద్రయన్ 3ని పంపి భారతదేశానికి మరో మైలురాయిని ఘనవిజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు భారత దేశ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, చరణ్ తేజ్, కిరణ్, శివ, మరియు జనసైనికులు పాల్గొన్నారు.