అమ్మిశెట్టి వాసు సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు

విజయవాడ తూర్పు నియోజకవర్గం: 22వ డివిజన్ లో 22వ డివిజన్ అధ్యక్షులు తోట శ్రీను ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సమక్షంలో పెద్ద ఎత్తున స్థానిక యువకులు, పెద్దలు, మహిళలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్, శివ, బన్నీ, ప్రభు, గోపి, రాజు, తేజ, మహేష్, కృష్ణ మరియు తదితరులను అమ్మిశెట్టి వాసు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంత బావజలానికి, రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర దిశాదశ నిర్దేశించే విధంగా పోరాటం చేస్తున్న విధానానికి ఆకర్షితులై జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని అమ్మిశెట్టి వాసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శ్రీమతి పోతిరెడ్డి అనిత, దోమకొండ అశోక్, పోతిరెడ్డి రమణ, హరి ప్రసాద్, కొవ్వూరి కిరణ్ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.