జనసేనలో చేరికలు

కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలం, ఎస్ కోనాపురంలో జనసేన పార్టీలోకి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు అంజినేయులు ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భారీ సంఖ్యలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల ఉపాధ్యక్షులు కళ్యాణదుర్గం నియోజకవర్గం సోషల్ మీడియా ఇంచార్జ్ రాయుడు, మండల ప్రధాన కార్యదర్శులు తిప్పేరుద్ర, నీలకంఠ, గోవిందు, కళ్యాణదుర్గం జనసేన నాయకులు సయ్యద్, రాజు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీలోకి చేరిన వారిలో కరేగౌడ, మణికంఠ, ఓబులేష్, వడ్డే రామంజి, నగేష్, బి.అశోక్, లక్ష్మణమూర్తి, డి.అశోక్, కమ్మర నాగరాజు, శశికుమార్, కమ్మర గోపి, చాకలి యన్నప్ప, డి.కె.అశోక్, తదితరులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ జనసేన పార్టీ అభివృద్ధి, సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని చర్చించడం జరిగింది.