ఘనంగా డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం 47వ వారం

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి & సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గము వారు ఏర్పాటుచేస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నపానీయ సదుపాయమును కల్పించుచున్నారు. 47వ వారం కూడా శనివారం రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చిన ఔట్ పేషెంట్లకు కలిపి 600 మందికి అన్నపానీయం సదుపాయమును కల్పించారు. వడ్డన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పిఠాపురం నగరజనసేన నాయకులు అల్లం కిషోర్, దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను, విప్పర్తి కృపాకర్, సాయిప్రియ సేవ‌సమితి కార్యదర్శి మేకల కృష్ణ తదితరులు ఆహరపా నీయ వడ్డనలో తమ సేవలను అందిస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, పేషెంట్ లకు ప్రత్యేకమైన సేవలు అందిస్తూన్నారు, సాయిప్రియ సేవాసమితి కార్యక్రమానికి సేవలందిస్తున్నారని వారిని ప్రత్యేకంగా జ్యోతుల శ్రీనివాసు చరవాణిలో అభినందించారు.