Chittoor: దామలచెరువులో జనసేనలో చేరికలు

జనసేన పార్టీ సిద్ధాంతాలు, శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను బలంగా పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితులై చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీకి చెందిన దాదాపు 100 మంది వైయస్సార్సీపీ యువనాయకులు జనసేన పార్టీ ఫాఛ్ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ.డా.పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో చంద్రగిరి చిత్తూరు జిల్లా కార్యదర్శి యం నాసీర్, సహాయ కార్యదర్శి శ్రీమతి బీగాల అరుణ ల ఆధ్వర్యంలో జనసేనపార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చరణ్ రాయల్, నాగూరు బాషా, రహంతుళ్ళ, మస్తాన్, నౌమూన్, హరి పాల్గొన్నారు.