జనసేన పార్టీలో చేరికలు

ఒంగోలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన పార్టీ ఒంగోలు నియోజకవర్గం, కొత్తపట్నం మండలం, మడనూరు పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు మండల అద్యక్షుడు నున్నా జానకిరామ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా జానకిరామ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందలకొద్దీ పార్టీలో చేరడం శుభపరిణామం అని, ఈ చేరికలు చూస్తున్నట్లయితే రేపు రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీకాంత్, ఏసురత్నం, మణికంఠ, జాలయ్య, జానీ మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.