సీతానగరంలో జనసేనలో చేరికలు

తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్త ప్రసాద్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, సమక్షంలో సీతానగరం వైసిపి నాయకులు, కాస్త సత్యనారాయణ, కుంచె సాయి, వీరికి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి శుక్రవారం జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలో స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, సీతానగరం మండల పార్టీ అధ్యక్షుడు కరిచేర్ల విజయ శంకర్ పాల్గొన్నారు.