పెండ్యాల హరి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణ

అనంతపురం జిల్లా జనసేన పార్టీ నాయకులు పెండ్యాల హరి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు పండ్లు అదేవిధంగా అనంతసాగర్ కాలనీలోని నిరుపేదలకు నాలుగు టన్నుల పండ్లు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, సంయుక్త కార్యదర్శి దేవరకొండ జయమ్మ, నాయకులు కాశెట్టి మురళి, తోట ప్రకాష్, అంజి, కొండిశెట్టి ప్రవీణ్, శీన, నార్పాల మండల అధ్యక్షులు రామకృష్ణ, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు ఏర్రిస్వామీ, జనసైనికులు రామయ్య, మోహన్, లోకేష్, విజయ్, రమణ, వినోద్, హరికృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.