హిందూపురం జనసేనలో చేరికలు

హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం వీరాపురం పంచాయితీకి చెందిన 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకై మేము భాగ్యస్వామ్యం అవుతాం అంటూ యువత రాజకీయాల్లోకి రావడం ఆనందదాయకం.
చిలమత్తూరు మండల అధ్యక్షుడు చిన్నా ప్రవీణ్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు అగ్గి శీన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరపురం పంచాయితీకి చెందిన 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. వీరికి హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము, జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, సీనియర్ నాయకుడు మల్లెపూల మధు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మారుతీ, బుజేందర్ రెడ్డి, ఆదినారాయణ, నాగరాజు, నరేంద్ర తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో చిలమత్తూరు మండల నాయకులు అంజి, శివ, లక్ష్మణ మూర్తి, మనోహర్, హరి, కిరణ్, రంగనాథ్, మరియు రవితేజ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.