కొత్తపేటలో జనసేనలో చేరికలు

కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామం నుండి కొంత మంది యువత గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కోటిపల్లి పండు, చింతపల్లి సత్తిపండు, కేతా ధనరాజు, చెరుకూరి శ్రీను అధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు స్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.