ఆకివీడు మండలంలో జనసేనలో చేరికలు

పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఉండి నియోజకవర్గ ఇంచార్జ్ రాష్ట్ర పిఏసి సభ్యులు కనకరాజు సూరి, ఆకివీడు మండల ప్రెసిడెంట్ కొటికలపూడి తాతాజీ ల సమక్షంలో ఆకివీడు మండలం చేరుకుమిల్లి పంచాయతీ కమతవానిగూడెంకు చెందిన వైసీపీ కార్యకర్తలు కమతం అశోక్, కమతం భాస్కర్, చుక్కా కిరణ్, చాబత్తిన వినయ్, కమతం అరుణ్, కమతం అనిల్,కమతం అనిల్ కుమార్, జాన్ బాబు తదితర వైసీపీ కార్యకర్తలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్దాంతాలు ప్రభావితం అయ్యి ఆకివీడు మండల అధ్యక్షుడు కోటికలపూడి తాతాజి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చేనమల్ల చంద్రశేఖర్, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి గవర లక్ష్మి మరియు ఆకివీడు మండల జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.