టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికా సమావేశం

రంపచోడవరం నియోజవర్గం: గంగవరం గణేష్ థియేటర్ ఆవరణలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు పాము అర్జున్ ఆహ్వానం మేరకు సమావేశంలో గంగవరం మండల పార్టీ జనసేన తరుపున కె ఆదినారాయణ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు నాయకులు కృషి చెయ్యాలని రంపచోడవరం టీడీపీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యేలు శ్రీమతి వంతల రాజేశ్వరి, శితం శెట్టి వెంకటేశ్వరావు, చిన్నం బాబు రమేష్ తెలిపారు. ప్రతి కార్యక్రమంలో కలిసి వెళదాం అని తెలిపారు. కుంజం సిద్దు జనసేన పార్టీ గంగవరం మండల కన్వీనర్ మరియు తదితరులు పాల్గొన్నారు.