తాడేపల్లిగూడెం, 11వ వార్డులో బొలిశెట్టి ప్రచారం

తాడేపల్లిగూడెం: ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెం 11వ వార్డులో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా వార్డులో అందరి ఇంటికి వెళ్లి, బొలిశెట్టి శ్రీనివాస్ (గాజు గ్లాస్ గుర్తుకి)కి ఓటు వేయమని, పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ (కమలం గుర్తుకి)కి ఓటు వేయమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తాడేపల్లిగూడెంనియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ వల వల మల్లికార్జునరావు, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు బొలిశెట్టి రాజేష్, తెలుగుదేశం సీనియర్ నాయకులు తోట గోపి తనయులు తోట రాజా, పట్టణ అధ్యక్షులు రాంపండు, యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, యాదాల శివాజీ, మైలవరపు రాజేంద్రప్రసాద్, మైలవరపు కృష్ణ ప్రసాద్, నీలాపాల దీనేష్, చాపల రమేష్, ముఖేష్, రమణ, పట్టణ వీరామహిళ అధ్యక్షురాలు వెజ్జు రత్నకుమారి, అడపా జమున, కటికిరెడ్డి కళ్యాణి, చిన్ని, మధుశ్రీ నాయుడు, పిడుగు రామ్మోహన్, బీజేపీ రంగారావు, కుమార్, ఉప్పు కృష్ణ, సాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.