అడ్డతీగల మండలంలో జనసేన, టిడిపి, బిజెపి పార్టీల ఉమ్మడి ప్రచారం

అడ్డతీగల మండలంలో రెండవ రోజు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు గెలిపించమని కోరుతూ..ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మిరియాల శిరీష దేవి ఎన్నికల గుర్తు సైకిల్ అరకు పార్లమెంటరీ ఎంపీ శ్రీమతి కొత్తపల్లి గీత ఎన్నికల గుర్తు కమలం, అని ప్రజలకు వివరించడం జరిగింది. కొట్టంపాలు, లంగుపర్తి, కినపర్తి, గౌరీపేట, వీరభద్రపురం, కోనలోవ గ్రామాలలో మూడు పార్టీలు ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం, జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, తెలుగుదేశం పార్టీ అడ్డతీగల మండల అధ్యక్షులు జర్త వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు బుర్లె హరిబాబు, అన్నం సత్తిబాబు, ఎడ్ల శీను, జుజ్జువరపు శ్రీనివాస్, కామను కృష్ణమూర్తి, ముర్రం కాశి బాబు, కంట్రోజు శ్రీనివాస్ రెడ్డి, కింతాడ నానిబాబు, రామకృష్ణ, బిజెపి పార్టీ అడ్డతీగల మండల అధ్యక్షులు ఆగూరి విశ్వరెడ్డి, జనసేన పార్టీ నాయకులు పొడుగు సాయి, చెదల అంజి మరియు తదితరులు పాల్గొన్నారు.