ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం నిరసన కార్యక్రమం

కొత్తగూడెం జిల్లా, మైనర్ బాలికకు న్యాయం జరగాలని అడిగినందుకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వీరమహిళలను అలాగే గ్రేటర్ నాయకులను, జనసేన కార్యకర్తలను, వీరమహిళలను అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషం. దీనిని రాష్ట్ర యువజన విభాగం పూర్తిగా ఖన్డిస్తూ… బాధితురాలికి న్యాయం జరిగే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూలకపల్లి మండలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రటరీ గరికే రాంబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడిమే వంశీ, తాటికొండ ప్రవీణ్, కందుకూరి వినీత మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.