ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం నిరసన కార్యక్రమం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మైనర్ బాలికకు న్యాయం జరగాలని అడిగినందుకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వీరమహిళలను అలాగే గ్రేటర్ నాయకులను, జనసేన కార్యకర్తలను, వీరమహిళలను అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషం. దీనిని రాష్ట్ర యువజన విభాగం పూర్తిగా ఖండిస్తూ… బాధితురాలికి న్యాయం జరిగే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు శనివారం మహబూబ్ నగర్ టౌన్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీ పి.ఆర్. రాఘవేంద్ర ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఎక్సిక్యూటివ్ మెంబర్ లక్ష్మి నారాయణ మరియు కళ్యాణ్, రామకృష్ణ, నరసింహ, గౌరవ్, వెంకటేష్, వెంకటేష్ బోయినపల్లి, సంజీవ్, మహేష్, భువన్, సురేష్, శివ బొయపల్లి, నరేష్, రోహిత్, చింటూ, శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.