జనసేనలో చేరిన జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామానికి చెందిన వైస్సార్సీపీ పార్టీ ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన జ్యోతుల శ్రీనివాస్ వారి అనుచరులు జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఆదివారం నియోజకవర్గ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో రాజమండ్రి వి. కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ మీ అందరికీ పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని, జనసేన పార్టీ నిజాయితీగా పోరాడుతుందని, దైర్యంగా పార్టీ బలోపేతానికి కృషిచేసి అధినేత గౌ౹౹శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం అని పిలుపు ఇవ్వడం జరిగింది. పార్టీ లో నాయకులు దేశాలంక భాస్కరరావు, శేఖ నాగేశ్వరావు, సాకునాలా రాంబాబు, జ్యోతుల గోపి, జ్యోతుల సీత రాంబాబు, మెడిబోయిన సత్తిబాబు జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, వెలుగుల లక్ష్మణ్, గొల్లపల్లి గంగ, గొల్లపల్లి శ్రీను జ్యోతుల వాసు, మొగలి శ్రీను, కోలా నాని, శాఖ సురేష్ బాబు, గోపు సురేష్, బుర్ర సూర్య ప్రకాష్ రావు, మాదేపెళ్లి పద్మరాజు, సిరిపురెడ్డి గణేష్, కసిరెడ్డి నాగేశ్వర్రావు, కంద సోమరాజు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.