24వ వార్డులో ఉమ్మడి అభ్యర్థి బొనేల విజయచంద్ర పర్యటన

పార్వతీపురం, తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పార్వతీపురం మున్సిపాలిటీ 24వ వార్డులో అశేష స్పందన జనవాహిని, డప్పులు మధ్య కార్యక్రమం ముందుకు సాగింది. జనసేన పార్టీ – తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి విజయ చంద్రకి ఘన స్వాగతం పలికిన ప్రజలు, మహిళలు విజయ తిలకం దిద్ది అడుగడుగునా నీరాజనం పలికారు. విజయ చంద్ర రాకతో ఒక్కసారిగా వార్డులో అక్కా చెల్లెలు అన్నా తమ్ముళ్లో ఉత్సాహం పెరిగింది. అనంతరం విజయచంద్ర మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గం పేదరిక నిర్మూలనే మా ధ్యేయం అని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే అందరి బ్రతుకులు మారుతాయి అని అన్నారు. అనంతరం జనసేన సీనియర్ నాయకులు చందక అనీల్ మాట్లాడుతూ మా ఉమ్మడి ప్రభుత్వం రాగానే ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాడమే మా లక్ష్యం అని తెలిపారు. వార్డుకు పట్టిపీడిస్తున్న స్మశానవాటిక సమస్య వెంటనే తీరుస్తాము అని తెలిపారు. అలాగే కొందరు సీనియర్ నాయకులు మాట్లాడుతూ జనసేన – తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చదువుతున్న విద్యార్థులుకు వాళ్లని విద్యావంతులుగా ఉద్యోగులు గా తీర్చిదిద్దే విధంగా ముందుకు  అడుగులు వేస్తాం అని ఇరు పార్టీ నాయకులు తెలిపారు. ఈ పర్యటనలో జనసేనపార్టీ పట్టణ సీనియర్ నాయకులు, జనసైనికులు మరియు పార్వతీపురం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గ్రామం నాయకులు, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.