వారాహి యాత్ర ప్రచార రథాలను ప్రారంభించిన జ్యోతుల శ్రీనివాస్

  • వారాహి యాత్ర గూర్చి ప్రజా చైతన్యం చేయు నిమిత్తం పిఠాపురం నియోజకవర్గం నందు మూడు ప్రచార రథాలను ప్రారంభించిన జ్యోతుల శ్రీనివాస్

పిఠాపురం నియోజవర్గం: జనహితం కోరే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న వారాహి యాత్రలో భాగంగా జూన్ 13, 14వ తేదీలలో పిఠాపురం నియోజవర్గం నందు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై పర్యటన చేస్తూ 14వ తేదీన పిఠాపురం నగరం నందు జరిగే బహిరంగ సభకు పిఠాపురం నియోజవర్గం గల 3 మండలాలు నందు గల ప్రజలను, జనసేన నాయకులను, జనసేన కార్యకర్తలను, జనసైనికులను, వీరమహిళలను పిఠాపురంనగరం నందు వారాహిపై బహిరంగసభకు తరలి రమ్మని ఆహ్వనించేందుకు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ 3 మండలాలకు 3 ప్రచార రథాలను ఏర్పాటు చేసి, మైకుల్లో మరియు పాంప్లెట్లు, వాల్ పోస్టర్లు, స్టిక్కర్ల ద్వారా 11, 12, 13వ తేదీలలో ప్రచారం ద్వారా జనాన్ని చైతన్యవంతం చేసి 14వ తేదీన పిఠాపురం నగరం నందు జరిగే వారాహి బహిరంగ సభ విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఆడియో క్యాసెట్ ఏర్పాటుచేసి ఆటోల ద్వారా ప్రసారం చేయుచున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం నందు ఆటో స్టాండ్ వద్ద నుంచి ఉప్పాడ కొత్తపల్లి మండలం. గొల్లప్రోలు మండలం. పిఠాపురం మండలం. సంబంధించిన ప్రచారరధముల వద్ద దుర్గాడ గ్రామ యాదవ సంఘం నాయకులు కొయ్య సుబ్బారావు కొబ్బరికాయలను కొట్టి, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ జండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామానికి చెందిన యండపల్లి శేషారావు, వెలుగుల దొరబాబు, జ్యోతుల సీతారాంబాబు, గుండ్ర అచ్చా రావు, జ్యోతుల పెద్ద శివ, మంతెన గణేష్, తీడా లొవరాజు, జ్యోతుల బాబ్జి, విప్పర్తి శీను, జ్యోతుల శివ, జ్యోతుల వాసు, జ్యోతుల రాము, జ్యోతుల గోపి, జ్యోతుల కోటేశ్వరరావు, జ్యోతుల గోపి, ముమ్మిడి సత్యనారాయణ, కొయ్య సాయి కృష్ణ, జ్యోతుల నానాజీ, కీర్తి చిన్నా, కోలా నాని, జిలకర భాను, విప్పర్తి లొవరాజు, విప్పర్తి ముసలయ్య, విప్పర్తి దొంగయ్య, తదితరులు పాల్గొన్నారు.