ఉదారగుణం చాటుకున్న జ్యోతుల శ్రీనివాసు

  • చేబ్రోలు బాలురుకు సహాయం అందించిన జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన నక్కా గోవిందు దంపతులు అనారోగ్యంతో మరణించారు. నక్కా గోవిందు దంపతులకు నక్కా నాగ చైతన్య, నక్కా ప్రసాదు అనే ఇద్దరు చిన్న వయసుగల కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు వృద్ధాప్యంలో గల నక్కా గోవింద్ తల్లి నక్కా అప్పయ్యమ్మ పెంచుచున్నది. నక్కా అప్పయ్యమ్మ బీద కుటుంబంనకు చెందినది. నక్కా అప్పయ్యమ్మ ఆర్థిక పరిస్థితులను చేబ్రోలు గ్రామ జనసైనుకులు ఫోన్ ద్వారా జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసుకు తెలిజేయగా జ్యోతుల శ్రీనివాసు వెంటనే స్పందించి పిల్లలకు 25 కేజీల బియ్యం, కిరాణాసామాన్లు వారికి అందజేసి ఇద్దరు పిల్లలలో ఒకరికి భవిష్యత్తులో చదువులు నిమిత్తం అవసరమైన తగు ఆర్థిక సహాయం చేస్తానని జ్యోతుల శ్రీనివాసు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు గ్రామ జనసేన నాయకులు ఉలవకాయల వీరబాబు, అల్లందొరబాబు, గారపాటి అంజి, గండికోట సాగర్, నక్కావెంకటరమణ, గురం పెద్దకాపు, యండపల్లి మణికంఠ, నక్కా నాగరాజు, గారపాటి ఉమా సత్యనారాయణ, పాకలపాటిస్వామి, తంగెళ్ల కళ్యాణ్, దాసరి అప్పారావు, గంటా గోపి, మేడిబోయిన సత్యనారాయణ, తంగెళ్ల చంటి తదితరులు ఉన్నారు.