జనసైనికుని కుటుంబానికి అండగా నిలచిన జనసేన

వేమూరు నియోజకవర్గం: కొల్లూరు మండలం, కొత్త చిలుమూరు గ్రామములో ప్రమాదవశాత్తు జనసైనికుడు భువణం సాయి మరణించడంతో మంగళవారం ఆ కుటుంబానికి జనసైనికులు, నాయకులు 11000 చెక్ పార్టీ తరపున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, రాష్ట్ర కార్యదర్శి విజయ్ శేఖర్, జిల్లా నాయుకులు ఇస్మాయల్, జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ పాల్గొనడం జరిగింది. ఎంపీటీసీ వెలివెల సుబ్రమణ్యం, ఎంపీటీసీ బొదుల అనూష, ఎంపీటీసీ హరి కృష్ణ, సర్పంచ్ వెలివెల బసవరతయ్య, సర్పంచ్ కోట నరేష్, చలమయ్య పాల్గొన్నారు. అదే విధంగా ఈ కారీక్రమములో ఎం.ఆర్.పి.ఎస్ నాయుకులు, బీసీ నాయుకులు వసుదేవ్ దాస్ పాల్గన్నారు. ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గ నాయుకులు సోమరౌతు బ్రహ్మం, వన్ కూరి గోపి, అమ్మిరాజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది.