జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం

హైదరాబాద్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 10, 11, 12 వ తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న వారికి కిట్ల పంపీణీ కార్యక్రమం గురించి మంగళవారం హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని ఉమ్మడి 10 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర వీర మహిళా చైర్మన్ కావ్య మండపాక మరియు ఉమ్మడి పది జిల్లాలకు చెందిన జనసేన విద్యార్థి విభాగం నేతలు, జనసేన యువజన నాయకులు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.